calender_icon.png 5 September, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

05-09-2025 03:28:22 PM

మందమర్రి (విజయక్రాంతి): వస్తు సేవా పన్నుపై సంస్కరణలు తీసుకువచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ మాట్లాడుతూ, పేద మధ్య తరగతి కుటుంబాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ సంస్కరణలు తీసుకొచ్చారని మేలు చేశారన్నారు. మోడీ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల ప్రభుత్వమని వారి సంక్షేమం కోసం అనుక్షణం పాటు పడుతున్నారని, మోడీ ప్రధానిగా ఉండడం దేశానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డివి దీక్షితులు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శనిగారపు శ్రీనివాస్, కార్యదర్శి దుర్గం సత్యం బాబు, శ్రీనివాస్, కొంతం రాజు, గాదే రాములు, దాసరి నర్సింగ్, జక్కుల మహేష్, కళ్యాణం శ్రీనివాస్, అయిందల రవీందర్, రమేష్, భాస్కర్, మురళి, వేణు, శ్రీరామ్ లు పాల్గొన్నారు.