27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం

19-12-2025 12:00 AM
  1. ఇల్లు నిలబెట్టారంటూ బాధితురాలు కృతజ్ఞతలు
  2. కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగులో ఘటన

మహబూబాబాద్,డిసెంబర్ 18 (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ చిత్రపటానికి ఓ బాధితురాలు క్షీరాభిషేకం చేసిన ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు తన పాత ఇల్లు పాడైపోగా కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి పం చాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నారు.

అయితే ఇంటి నిర్మాణ సమయంలో కొందరు అడ్డు తగిలి, ఇంటి నిర్మాణం చేయకుండా తమపై బెదిరింపులకు దిగడం దాడికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై తమ వద్ద ఉన్న అనుమతి ప త్రాలను తీసుకువెళ్లి పోలీసులను ఆశ్రయించామని బాధితురాలు పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు తమపై అకారణంగా దాడికి పాల్పడ్డ వా రిపై చర్యలు తీసుకొని తమ ఇంటి నిర్మాణానికి ఇ బ్బందులు లేకుండా చేశారని కృతజ్ఞతగా ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు బాధితురాలు సులో చన పేర్కొన్నారు.