18 July, 2026 | 12:45 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

రైతుల పక్షాన మిల్లర్లు బాధ్యత తీసుకోవాలి

16-05-2026 08:53 PM

మిల్లుకు వచ్చిన వాహనాల నుండి త్వరితగతిన వరి ధాన్యం దిగుమతి చేయాలి

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

తుంగతుర్తి(విజయక్రాంతి): రైతుల పక్షాన మిల్లర్లు బాధ్యత తీసుకొని మిల్లులో వరి ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని ఎస్పి నరసింహ మిల్లర్లను కోరారు. నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం వద్ద ఉన్న సోమేశ్వర రైస్ మిల్ నందు వరి ధాన్యం దిగుమతులను శనివారం జిల్లా ఎస్పీ నర్సింహా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పంట దిగుమతి బాగా వచ్చింది, రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు.

కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వరి ధాన్యాన్ని వాహనాల నుండి త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు సూచించారు, మిల్లు యజమానులతో, మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి ధాన్యం దిగుమతి వివరాలు తెలుసుకున్నారు. వరి ధాన్యాన్ని తరలించడానికి లారీ యజమానులు డ్రైవర్లు సహకరించాలని కోరారు. పండిన పంట వర్షంలో తడవకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని అవసరమైన టార్ఫాలీన్లు పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపాలని సూచించారు.