రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
15-12-2025 12:28 AM
- సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు
- నేడు, రేపు జిల్లాల్లో శీతల గాలులు
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెం డు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. సోమవారం, మంగళవారం పలు ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది.




