చారిత్రాత్మక నాగన్న మెట్ల భావిని సందర్శించిన మంత్రి జూపల్లి
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో గల 400 సంవత్సరాల చారిత్రాత్మక నాగన్న మెట్ల భావిని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. 400 సంవత్సరాల చారిత్రాత్మక గల నాగన్న మెట్ల భావిని పునరుద్ధరించిన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ & రైన్ వాటర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. లింగంపెట్ నాగన్న మెట్ల భావినీ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రభుత్వ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీ సురేష్ శెట్కర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




