calender_icon.png 8 September, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే..

08-09-2025 11:36:03 AM

హైదరాబాద్: ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మీడియా సమావేశంలో అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని.. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని పేర్కొన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది ఉద్దేశమని.. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవం అని.. ఎరువుల బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా నాలుగు నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని.. రామగుండం కార్మాగారంలో ఎరువులను ఉత్పత్తి చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి 11 లక్షల టన్నులకు గాను 5.2 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయని అన్నారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకోవాల్సిందేనని.. రాజకీయ కక్ష ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై తీర్చుకోవాలని తెలిపారు. రైతుల సహకారంతో బీజేపీకి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.