మై నేషన్ గ్యాస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం
05-12-2024 11:39 AM
హైదరాబాద్, (విజయక్రాంతి): చంచల్ గూడ జైలు ఆవరణలో మై నేషన్ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్ ను హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ , జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్త, ఇండియల్ ఆయిల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మరో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభించడం అభినందనీయం అన్నారు.




