05-12-2024 11:36:39 AM
నారాయణఖేడ్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమాకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సంగారెడ్డి లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. ఎమ్మెల్యే వెంట నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు బి రాజు, పండరి రెడ్డి తదితరులు ఉన్నారు.