తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
30-06-2024 01:53 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం అభినందిం చారు. కేంద్రంపై తెలుగురాష్ట్రాలు ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖపై దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.






