calender_icon.png 8 June, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

07-06-2025 06:26:37 PM

మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాల కోసం నాలుగు కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు మండలాల్లోని 16 అంగన్వాడీ కేంద్రాలు 11 గ్రామపంచాయతీ భవనాలు ఉన్నాయి.

కాటారం మండలంలోని మద్దులపల్లి, ధర్మసాగర్, మహా ముత్తారం మండలంలోని బోర్ల గూడెం, మాదారం, ములుగు పల్లి, నిమ్మగూడెం, మహదేవపూర్ మండలంలోని రాపల్లి కోట, కుదురుపల్లి మలహర్ రావు మండలం కొయ్యూరు, మల్లంపల్లి పలిమేల మండలంలోని లింకలగడ్డలో గ్రామపంచాయతీ భవనం ఒక్కొక్క గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు.

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ భవనాలు కాటారం మండలంలోని రేగులగూడెం, ఒడిపిలవంచ ఇబ్రహీంపల్లి, జాదురావుపేట, మహా ముత్తారం మండలంలోని గండికామారం, వజీన పల్లి, బోర్ల గూడెం, మహాదేవపూర్ మండలం పలుగుల, మద్దులపల్లి, అంబటిపల్లి, బెగులూరు, మలహర్రావు మండలం మల్లంపల్లి, పెద్ద తుండ్ల, వల్లెంకుంట, కిషన్ రావు పల్లి, గాదంపల్లి, మొదలగు గ్రామాలలో అంగన్వాడీ భవనాల నిర్మాణం కొరకు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 12 లక్షల చొప్పున మొత్తం గ్రామపంచాయతీ భవనాలు అంగన్వాడి భవనాలు కొరకు నాలుగు కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరు చేయించి ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు కృతజ్ఞతలు తెలిపారు.