07-06-2025 06:28:52 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరు: బక్రీద్ పండుగ(Eid al-Adha) త్యాగానికి చిహ్నమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.