06-06-2025 11:57:51 PM
-మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
-ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వెల్లడి
శేరిలింగంపల్లి, జూన్ 6: గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు మంత్రి వెళ్లారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం మాగంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు మంత్రికి చెప్పారు. ఎమ్మెల్యే తనకు సన్నిహితుడు అని, ఆయన కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. ప్రభుత్వపరంగా తాము అండగా ఉండి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడే ఉన్న మాగంటి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. అధైర్య పడొద్దని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.