06-06-2025 11:56:31 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని ఘట్టయ్య సెంటర్ లో యూనిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ ఆఫీస్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా యుగందర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇలాంటి మరెన్నో ఏన్నో కార్యాలయంలు ప్రారంభించాలని కోరారు. అలాగే కస్టమర్స్ కు మంచి సర్వీసు ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మిక్కిలి నేని నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పువ్వా ళ దుర్గాప్రసాద్, టి ఎన్జీవోస్ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.