28-06-2025 12:18:05 PM
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో శుక్రవారం రాత్రి బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పరామర్శించారు. పట్టణంలోని మర్రివాడకు సంబంధించిన మంథని హమాలీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మున్నూరు కాపు డివిజన్ మాజీ అధ్యక్షులు,కార్మిక నాయకులు బాసాని రాజయ్య ఇటీవల మృతిచెందిగా పెంజేరు కట్ట లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రిటైర్డ్ సీఈ దేవల్ల తులసి దాస్ తల్లి దేవల్ల రత్నమ్మ కుటుంబాన్ని, అవధానుల నరసింహ శర్మ,రమేష్ గార్ల మాతృమూర్తి అవధానుల జయప్రద మరణించగా పోచమ్మ వాడ చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సార్ల సంపత్ తండ్రి సార్ల బాణయ్య మరణించగా బీసీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మాచిడి రవితేజ గౌడ్ అత్తమ్మ ఇటీవల మరణించగా వల్ల ఇంటికి వెళ్లి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.