23-06-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూన్ 22:కరీంనగర్ కలెక్టరేట్ లో ఆదివారం రోజున జరిగిన ఉమ్మడి జిల్లాల రివ్యూ సమావేశానికి విచ్చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ దారం శ్రీనివాస్ రెడ్డి సంగేం లక్ష్మణరావు గార్లు కలిసి వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా ఇటీవల సస్పెన్షన్కు గురైన వ్యవసాయ శాఖ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ని ర్దోషులకు న్యాయం చేయాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెం డు రోజుల్లో వ్యవసాయ శాఖ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోటిఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, రాగి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్ నాయకులు రమేష్ గౌడ్, పోలు కిషన్, కామ సతీష్ పటేల్, అజ్గరుద్దిన్, కరుణాకర్ లవ కుమార్ మరియు పవన్పాల్గొన్నారు.