calender_icon.png 17 June, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలకు సీఎం విలువ ఇస్తారు: మంత్రి తుమ్మల

16-06-2025 06:17:27 PM

హైదరాబాద్: గతేడాది మార్చి 6వ తేదిన తెలంగాణ ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని(Farmer's Friend Program) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం(Prof. Jayashankar Telangana Agricultural University Auditorium)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించారు. ఈ రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,  పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, రేపటి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వంపైకి నెడుతున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలకు సీఎం రేవంత్ రెడ్డి విలువ ఇస్తారని, రైతులపట్ల, వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రికి ఎంతో ఆపేక్ష ఉందని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వ నేతల అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తుంటే ఉలికిపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి ఎవరిపైనా ప్రతీకారం లేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 

ప్రతి మంగళవారం రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలు పంచుకునేలా వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు రైతులకు తెలియజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 57 వారాలుగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో 6.35 లక్షల మంది రైతులు పాల్గొని తమ సందేహాలను తీర్చుకున్నారు. ఇప్పటి వరకు 566 రైతు వేదికలలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఇకాపై 1034 రైతు వేదికలకు విస్తరించనున్నారు.