calender_icon.png 18 June, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్

18-06-2025 06:16:05 PM

హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Telangana Dr. BR Ambedkar Secretariat)లో రాష్ట్ర ఎంపీల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint Presentation)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, మల్లు రవి, చామల కిరణ్ కుమర్ రెడ్డి, సురేశ్ షెట్కార్, రఘురాంరెడ్డి, అనిల్ కుమార్ యాదమ్,  బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ హాజరయ్యారు. గోదావరి-బనకచర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

గోదావరి-బనకచర్ల(Godavari-Banakacherla)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫ్రీ ఫీజబిలిటీ నివేదిక సమర్పించిందన్నారు. తెలంగాణలోకి గోదావరి రెంజల్ మండలం కందకర్తి వద్ద ప్రవేశిస్తుందని, రాష్ట్రంలో గోదావరిపై ఎస్ఆర్ఎస్పీ తొలి ప్రాజెక్టును నిర్మిస్తుందని ఆయన వివరించారు. ఎస్ఆర్ఎస్పీ తొలి ప్రాజెక్టు సామర్థ్యం తుమ్మిడిహట్టి వద్ద 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టిందన్నారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 4 రిజర్వాయర్లు డిజైన్ చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో రూపొందించారని తెలిపారు. 484 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును 2009లో రూపకల్పన చేశారని, పోలవరం కింద కొన్ని చిన్న చిన్న టెంపరరీ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు.