నీటిపారుదల అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
16-06-2024 02:28 PM
హైదరాబాద్: సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్న అంతర్ రాష్ట్ర నీటి వనరుల సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో జలసౌధలో సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, నీటిపారుదల సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటిపారుదల కార్యదర్శులు రాహుల్ బుజ్జా, ప్రశాంత్ పాటిల్, ఇరిగేషన్ ఈఎన్సీ నాగేంద్రరావుతో సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్న అంతర్ రాష్ట్ర నీటి వనరుల సమస్యలపై సమీక్షించారు.






