30 April, 2026 | 12:25 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మానవత్వం చాటుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

12-03-2026 11:43 AM

రోడ్డు ప్రమాద బాధితులకు స్వయంగా సహాయం

షాద్‌నగర్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పరమావధిగా మంత్రి వాకిటి శ్రీహరి  ఉదారతను చాటుకున్నారు. గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై పాల్మాకుల వద్ద జరిగిన ఘోర బైకు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.మక్తల్ పర్యటనకు వెళ్తున్న మంత్రి, ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. రక్తపు మడుగులో, భీతావహంగా ఉన్న మృతదేహాలను చూసి వెనకడుగు వేయకుండా, తన సిబ్బందితో కలిసి మంత్రి స్వయంగా వాటిని పక్కకు తొలగించారు.

వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ​అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ, ప్రోటోకాల్ కంటే ప్రాణానికే విలువిచ్చిన మంత్రి తీరుపై ప్రయాణికులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రజా ప్రతినిధి అంటే కేవలం హోదా మాత్రమే కాదు, బాధ్యత కూడా" అని ఆయన నిరూపించారని పలువురు కొనియాడారు.