21-06-2025 01:59:54 AM
పెద్దపల్లి, జూన్ 20(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను శుక్రవారం ఆయన నివాసంలో పెద్దపల్లికి చెందిన మైనార్టీ నాయకులు మీర్జా అహ్మద్ బేగ్, మీర్జా మోహిద్ బేగ్, కాంగ్రెస్ నాయకులు మ మ్మద్ ఖాజా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వా రు మంత్రి దృష్టికి తెలంగాణలోని మైనార్టీల అభ్యున్నతికి, విద్య, యువత నైపుణ్యానికి సహకరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మై నార్టీ గురుకులాల పాఠశాలలో మెరుగైన సదుపాయాలను కల్పించాలని కోరారు.
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ విషయాలపై సానుకూలంగా స్పందించి తప్పకుండా మైనార్టీల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు అయ్యేలా కృషి చేస్తానని, మైనార్టీ గురుకుల పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని తెలిపారు.