calender_icon.png 21 June, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదోరోజు.. ఏడు ఎకరాల వరకు రైతుభరోసా

21-06-2025 01:58:29 AM

  1. రూ.905.89 కోట్లు విడుదల చేసిన సర్కార్ 
  2. ఇప్పటివరకు 65.12 లక్షల మంది ఖాతాల్లో జమ
  3. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి  

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులు ఖాతాల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు పెట్టుబడి సాయం అందుతోంది. శుక్రవారం.. ఐదోరోజు ఏడెఎకరాల వరకు  భరోసా నిధులు జమచేశారు.

ఇందుకోసం రూ. 905.89 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 65.12 లక్షల మందికి రైతు భరోసా సాయం అందించినట్టు చెప్పారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా సాగుభూమికి సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు.