15 June, 2026 | 8:55 PM

Breaking News

గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •  

ఆర్మీ నేపథ్యంలో మిషన్ 007

26-01-2025 01:12 AM

మహంకాళి పిక్చర్స్ పతాకంపై భరత్ చౌదరి, ప్రియాంక నాంది హీరోహీరోయిన్లుగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిషన్ 007’. ఈ సినిమాను జే మోహన్‌కాంత్ దర్శకత్వం లో మహంకాళి నాగ మహేశ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా హీరో భరత్ మాట్లాడుతూ.. ‘ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనగానే భయం వేసింది. కానీ డైరెక్టర్‌లోని కాన్ఫిడెన్స్ చూసి నేను ధైర్యం చేశాను’ అని తెలిపారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ.. ‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు దేశభక్తి ఉండటం మా సినిమాకు గర్వకారణం’ అన్నారు.

దర్శకుడు మోహన్ కాంత్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు షూటింగ్ చేస్తే సబ్సిడీ ఇస్తామని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ వారు చెప్తే అక్కడి లొకేషన్స్ సెలక్ట్ చేసుకున్నాం’ అని తెలిపారు. నిర్మాత నాగమహేశ్ మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్‌పుట్ మీద ఉన్న నమ్మకంతో ముందుగా అనుకున్న బడ్జెట్‌ను క్రాస్ చేసి వెళుతున్నా’ అని చెప్పారు.