టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించారు. బుధవారం విడుదల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబా-పూలే BC సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులు 100% ఉత్తీర్ణతతో తను ప్రతిభను చాటారు. చింతల శ్రీజ 581 మార్కులతో మొదటి సానం ఉండగా, వరుసగా కోట అక్షయ - 566 ,చండె స్వాతి- 565, తాళ్ళపల్లి సహస్ర - 560, గుమ్మడి వైష్ణవి - 555 మొదటి 5వ స్థానాల్లో ఉన్నారు. మొత్తం 34 మంది విద్యార్థినులు 500 లకు పైగా మార్కులు సాధించారనీ ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా టెన్త్ ఫలితాల్లో అత్యున్నత ప్రతిభను చాటిన విద్యార్థినులను ఆర్సీ ఓ శ్రీదర్, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాద్యాయ బృంధం అభినందించారు.






