04-06-2025 12:00:00 AM
బైంసా, జూన్ ౩ (విజయక్రాంతి): వానకాల సీజన్లో రైతులకు అవసరమయ్యే విత్త నాలను మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పంపిణీ చేశారు. స్థానిక విశ్రాంతిభవనంలో విత్తనం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వివిధ పంటల విత్తనాలను అందించారు. వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులో ఉండి మేలు రకం పంటల పై అవగాహన కల్పించాలని సూచించారు