04-06-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, జూన్ 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం - రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి వ్యవసాయ అధికారులు మంగళవారం నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. బెల్లంపల్లి మండలంలో వరి KNM 1210 రకం సన్న వడ్ల విత్తన సంచులు 10 kg బస్తాలు, పెసర MGG 347 3 కేజీ బ్యాగ్ ల ను ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేశారు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇద్దరు రైతులకు రూ. 50 నామినల్ ఛార్జీలు తీసుకొని విత్తన బస్తాలు పంపిణీ చేశారు. విత్తనాలు పొందిన రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో విత్తనోత్పత్తిలో మెలుకువలు నేర్చుకునీ విత్తనోత్పత్తి చేయిస్తారు. వచ్చిన విత్తనాలను అదే గ్రామంలోనీ ఇతర రైతులకు విత్తనాలు ఇవ్వాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని మండల వ్యవ సాయ అధికారి ప్రేమ్కుమార్ తెలిపారు.
రైతులు పండించిన పంటను ధాన్యంగా మార్చకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మ న్ చింతంస్వామి, బెల్లంపల్లి ఏడిఏ రాజానరేందర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాల ప్రొఫెసర్ డా.రత్నాకర్, ఏఈఓ లు తిరుపతి, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.