calender_icon.png 23 June, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మంత్రిని కలిసిన ఎమ్మెల్యే డా.సంజయ్

17-06-2025 12:24:36 AM

జగిత్యాల అర్బన్, జూన్ 16 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియాకమైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్ సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విత్తనాలు నాణ్యత పాటించాలని సీడ్ కంపెనీ వారికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు.

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ సీడ్ ప్రాసెస్ యూనిట్ మంజూరై చాలా సంవత్సరాలు గడుస్తుందని, సీడ్ ప్రాసెస్ యూనిట్ పాత బకాయిలు మంజూరు చేసి, యూనిట్ను త్వరిత గతిన పూర్తి చేసే వి ధంగా చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నూతనంగా నియామకమైన వాకిటి శ్రీహరిని కలిసి ఎమ్మెల్యే సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.