17-06-2025 12:27:02 AM
బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరి ప్రసాద్
కరీంనగర్, జూన్ 16 (విజయ క్రాంతి): విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లు ఇప్పుడు స్థానిక సంస్థలలో అమలు పరిచిన తరువాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బిసి కుల సంఘాలు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఆగమేఘాల మీద కుల గణనచేసి బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టితే అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపినాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బిల్లును గవర్నర్ కు పంపి ముఖ్యమంత్రి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. వెంటనే 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించి, తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.