17-06-2025 12:23:07 AM
జగిత్యాల అర్బన్, జూన్ 16 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి 59 దరఖాస్తులు రాగా, కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా వినతులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, వివిధ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులుపాల్గొన్నారు.