25-01-2026 12:10:18 AM
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, జనవరి 24(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదల కు వరం లాంటిదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కాలనీకి చెందిన భరత్ రావు కు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కును ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆప న్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.