01-11-2025 12:15:00 AM
కొత్తపల్లి, అక్టోబరు 31 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనిలోని హనుమాన్ ఆలయ దర్శనా నికి అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ను మాజీమంత్రి, ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ తొలగించారు. కాలని వా సుల అధ్వర్యంలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా కొంతమంది భూ కబ్జాదారులు ఆలయ దారికి అడ్డంగా ఫెన్సింగ్ వేసారు .
ఈ విషయాన్ని కాలని వాసులు ఎమ్మెల్యే గంగుల దృష్టి కి తీసుకెళ్లగా శుక్రవారం ఆయన స్వయంగా చేరుకొని ఫెన్సింగ్ ను తొలగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, దిండిగాల మహేష్, రాజ రాజేశ్వర కాలని అధ్యక్షులు గాండ్ల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు, కీర్తన, బొందవ్వ, అంజలి, స్వరాజ్యం, లక్ష్మీ , సుగుణ, తదితరులుపాల్గొన్నారు.