28-10-2025 08:20:51 PM
పటాన్ చెరు: నిరుపేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పలోత్ రఘు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేయగా.. రెండు లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం మంజూరు అయింది. ఈ మేరకు రఘు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి అందజేశారు.