30-05-2025 09:09:42 PM
క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక రక్తదాన శిబిరం
కాంగ్రెస్ ,యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలి
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జూన్ 1న ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, తమ రక్తదానంతో ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో భాగస్వాములవ్వాలని,ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు.