29-05-2025 06:28:19 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ యంపిపి బొడ్డు సులోచన మృతి చెందగా ఆమె భౌతికకాయానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని లింగయ్య, గరిసె రవి, గూడూరు శివశాంత్ రెడ్డి, కేశిరెడ్డి నీరజారెడ్డి, బద్దం సంజీవరెడ్డి, కొండూరు సాయి, ఎమ్మె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.