calender_icon.png 31 May, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టర్ ఆవిష్కరణ..

29-05-2025 06:30:04 PM

హుజరాబాద్ (విజయక్రాంతి): వికాస తరంగణి ఆధ్వర్యంలో స్వర్ణామృత ప్రాసన గుళికల వితరణ పోస్టర్ని కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని రామాలయంలో వికాస తరంగిణి బాధ్యులు శ్రీధరాచార్యులు, యతిపతి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ త్రి దండి చిన్న జీయర్ రామానుజ స్వామి వారి దివ్య ఆశీస్సులతో పుష్యమి నక్షత్రరోజున శనివారం ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు స్వర్ణ అమృత గుళికలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ గుళికలను ఆరు నెలల పిల్లలనుండి 16 సంవత్సరాల పిల్లల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ గుళికల వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది,రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మానికి నిగారింపుని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, మేధాశక్తిని పెంచుతుందని, గుళికలు వేసుకునే అరగంట ముందు, అరగంట తర్వాత ఏమీ తినకుండా ఉండాలని తెలిపారు.  ఇట్టి గులికలను కులమత బేధాలతో సంబంధం లేకుండా ప్రతి నెల హుజరాబాద్ లో పుష్యమి నక్షత్రం రోజున ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్యన ఇవ్వడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి శ్రీవాణి, దివిటి అంజనీదేవి, శ్రీనివాస్,ఎత్తిపత్తి నిరంజన్, కుమార్, శ్రావణ్, కుమారస్వామి, శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.