17-07-2025 12:00:00 AM
టేకులపల్లి, జులై 16, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ గ్రామం లో ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే కోరం కనక య్య శంకుస్థాపన చేశారు. కొన్ని ఇళ్లకు భూ మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులోని రైతువేదిక వద్ద కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు రూ.5 లక్షలు ఇ ల్లు నిర్మించుకునేందుకు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుందన్నారు. అంతే కాకుండా రాష్ట్రం అప్పుల ఉబి లో ఉన్నపటికీ ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని ఒ క్కొకటికగా ప్రజలకు అందచేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించె విధంగా మనం అందరం కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ని లవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ మల్లీశ్వరి, టేకులపల్లి సిఐ సురేష్, ఎస్ ఐ రా జేందర్, హోసింగ్ ఏఈ గణేష్, పీఏసిఎస్ చై ర్మన్ లక్కినేని సురేందర్ రావు, కాంగ్రెస్ మం డల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, భద్రు నాయక్, మాజీ సర్పంచ్ బుజ్జి - శివ, ఊళ్ళోజి ఉదయ్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, బండ్ల రజినీ - శ్రీనివాస్, సరిత, బొడ్డు అశోక్, చెన్నయ్య, బానోత్ రవి, శం కర్, రాసమళ్ళ నర్సయ్య, గురవయ్య, రాం దాస్, వీరభద్రం, హనుమంతు, మూడ్ సం జయ్, నాని, బాలకృష్ణ, నాగేశ్వరావు, శివ లాల్, భీముడు, సక్రు, కల్తీ కృష్ణ, బన్సీలాల్ సుదీప్ తదితరులు పాల్గొన్నారు.