06-06-2025 01:17:32 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మాగంటి గోపినాథ్ బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే గుండోపోటుకు గురైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారని తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మాగంటి ఐసీయూలో ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని హరీశ్రావు తెలిపారు. ౪౮ గంటలపాటు వైద్యుల నిరంతరాయంగా వైద్యుల పరిశీనలో ఎమ్మెల్యే గోపినాథ్ ఉంటారని చెప్పారు.