24 August, 2026 | 9:50 PM

బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

24-08-2026 08:16 PM

కోదాడ,(విజయక్రాంతి): నడిగూడెం మండలంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్లాస్ ఖాన్ పేట తండ నుండి రామాపురం వరకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రోడ్డు నిర్మాణం పూర్తైతే ఆయా గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జ్యోతి మధు, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి, సర్పంచులు, నాయకులు వెంకటరెడ్డి, ధరావత్ వరలక్ష్మి, వెంకటరమణ, దున్నా శ్రీనివాస్, వెంకట్, సైదులు నాయకులు పాల్గొన్నారు.