16-06-2025 11:03:16 PM
మునగాల: ఆకుపాముల రైతు వేదికకు రైతుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను కేసాగాని వీరబాబు జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులు సోమవారం వ్యవసాయ అధికారులకు ఆర్డీవో సూర్యనారాయణ(RDO Suryanarayana), ఏడిఏ ఎల్లయ్యల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... రైతుల దాహార్తిని తీర్చడానికి వాటర్ కూలర్ ఇవ్వడం అభినందనీయమన్నారు. కేసగాని వీరబాబు ఈ ప్రాంత రైతుగా వుంటూ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం బాధాకరమని, అతని కుటుంబానికి రైతు భీమా సకాలంలో అందించడంలో కృషి చేసిన వ్యవసాయ అధికారులను అభినందించారు.
రైతులు వ్యవసాయ సలహాలు,సూచనలు తీసుకొని సేంద్రియ పద్దతుల్లో మంచి లాభాలు గడించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆఫీసర్ శిరీష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, మండల వ్యవసాయ అధికారి డి. రాజు, ఏఈఓ రేష్మ,ఆకుపాముల రైతులు కేసగాని వెంకటేశ్వర్లు, రమేష్ రాజు వెంకటనారాయణ, కేసగాని వీరబాబు కుటుంబ సభ్యులు అమూల్య, కాశమ్మ,వీక్షిత్ మరియు రైతులు పాల్గొన్నారు.