20 July, 2026 | 6:52 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

నాగలి పట్టిన ఎమ్మెల్యే పాల్వాయి

20-07-2026 01:07 AM

బెజ్జూర్ జూలై 19 (విజయ క్రాంతి) కాగజ్ నగర్ మండలం లోని అంకుసాపూర్ పంట చేనులో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నాగలి పట్టారు. సర్వే నం.145 లో దాదాపు 30 మంది రైతులకు ప్రభుత్వం గతంలోనే లావుని పట్టాలు ఇచ్చిందని,దశాబ్దాలకు పైగా సాగు చేసుకుంటున్న ఈ భూములపై ఫారెస్ట్ అధికారుల కన్ను పడ్డదని, ఈ భూమి మాదేనని రైతుల సాగును అడ్డుకోవడం జరుగుతోందన్న  విషయం తెలుసుకున్న సిర్పూర్ శాసనస భ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రైతులకు సంఘీభావంగా సర్వే నెం.145 లోని భూమిని దున్ని పత్తి విత్తనాలు వేయడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని, పట్టాలున్న రైతులను కూడా సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని, ఇది అన్యాయమని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇదే విధంగా రైతులను ఇబ్బంది పెట్టిందని, ఈ ప్రభుత్వం కూడా అంతే దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అంకుసాపూర్ లో పట్టాలున్న రైతుల జోలికి వెళ్ళవద్దని ఫారెస్ట్ అధికారులకు హితవు పలికారు.  లేని పక్షంలో రైతుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మానేపల్లి సత్తయ్య, గౌత్రే హనుమంతు, డోంగ్రే కార్తీక్, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.