20 July, 2026 | 6:54 PM

Breaking News

కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •  

వానదేవుడు కరుణించాలని 44 గ్రామాల గిరిజనుల పూజలు

20-07-2026 01:09 AM

అడవిలో కొలువుదీరిన  దేవుడికి మొక్కులు

ఉట్నూర్, జూలై 19 ( విజయక్రాంతి ): వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచిన  వర్షాలు కోరేకపోవడంతో  వాన దేవుడితోపాటు  గజ్జల దేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని  గిరిజనులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలోని 44 గ్రామాలకు చెందిన ఆదివాసి గోండు గిరిజనులు  వాడ్ గగావ్,వాల్గొండ హీరపూర్  రెవిన్యూ గ్రామాల శివారులో కొలువుదీరిన  ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవుడు  గజ్జల దేవుడి దగ్గరికి చేరుకొని  వర్షం కురిపించాలని,

పంటలు బాగా పండాలని కటోర దీక్షతో  మొక్కులు చెల్లించుకున్నారు. తమ మొక్కులను  మన్నించి వర్షాలు కురిపిస్తే  మరోసారి ముక్కులు తీర్చుకుంటామని  ఆదివాసి గిరిజనులు  మొక్కులు చెల్లించుకున్నారు. గజ్జల దేవుడి  పూజారులుకినక శంభు, ఆత్రం ధర్ము  ల ఆధ్వర్యంలో  44 గ్రామాల పటేల్ ల తో ఆదివాసి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని  దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు.