07-05-2025 01:09:07 AM
మణుగూరు, మే 6 (విజయ క్రాంతి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జన్మదిన వేడుక లు మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనం గా నిర్వహించారు.
సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రజల సమక్షంలో గడపాలని.... రాజకీయంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు ముక్తకంఠంతో వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. గజమాలతో ఆయనను సత్కరించారు. అభిమానం చూపిన అందరికీ ఎమ్మెల్యే పాయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.