02-06-2025 12:45:10 AM
అశ్వాపురం, జూన్ 1(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన శెట్టిపల్లి సీత కుటుంబాన్ని పెనపాక ఎమ్మెల్యే పోయం వెంకటేశ్వర్లు ఆదివారం పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం మేడారం స మ్మక్క సారక్క దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు తాడువాయి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను ఇసుక లారీ ఢీకొట్టిన ప్రమాదంలో సీత అక్కడికక్కడే మృతి చెందారు.
చనిపోయిన సీత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చిన మీ ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటానని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరు గంటి బిక్షమయ్య,గాదె కేశవరెడ్డి ఓరుగంటి రమేష్, బేతం రామకృష్ణ, పిట్ట కృష్ణారెడ్డి, గొల్లపల్లి నరేష్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.