8 March, 2026 | 4:44 PM

ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

17-10-2025 05:10 PM

నకిరేకల్,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన  వల్లపు పద్మకు 2 లక్షల 50 వేలు, వలదాసు వెంకటమ్మకి 1 లక్ష ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్ఓసి కాఫీని శుక్రవారం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ, నాయకులు గుత్తా మాధవరెడ్డి, పన్నాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.