23-06-2025 06:32:08 PM
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణ రావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో అదనంగా మరో 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) అన్నారు. సోమవారం మండలంలోని పెద్దకల్వల, పెద్ద బొంకూరు, దస్తగిరిపల్లి గ్రామాల్లో సోమవారం రూ.69 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి, ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని, రాజకీయాలకతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 3 సంవత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని, రైతన్నలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. జిల్లాకు రూ. 38 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇస్తే, కేవలం సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామని, అనంతరం గ్రామస్థులు నాయకులు ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, నూగిల్ల మల్లన్న, బండారి రామ్మూర్తి, దండనవేణి రాజేందర్, కలవేన మహేందర్, కరెంగుల రమేష్, ఆర్కూటి సంతోష్ యాదవ్, పెగడ రమేష్, సరోత్తం రెడ్డి, మిట్టపల్లి శ్రీకాంత్, మిట్టపల్లి కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి సుధాకర్ రెడ్డి, డా. రమేష్, చెవుల తిరుపతి, సలేంద్ర రాజయ్య, ఉప్పు కొమురయ్య, వినోద్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.