calender_icon.png 23 June, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిట్యాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు

23-06-2025 06:36:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం వల్ల సమాజంలో యువత, విద్యార్థులు నిర్వీర్యం అవుతున్నారని నిర్మల్ రూరల్ సీఐ యం కృష్ణా(Rural CI Krishna) తెలియజేశారు. నిర్మల్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో స్టాప్ డ్రగ్స్ స్టార్ట్ లివింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడే దుష్ఫలితాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణా మాట్లాడుతూ... మత్తు పదార్థాల వినియోగం వల్ల చదువులో, వృత్తిలో వెనుకబడటమే కాకుండా నేర ప్రవృత్తి పెరిగిపోతుందని విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాల వినియోగంకు దూరంగా ఉండాలి అని తెలిపారు. తరువాత పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ ఎస్సై జి.లింబాద్రి, పోలీసు స్టాప్, ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు గజపల్లి నర్సయ్య, గ్రామ సెక్రెటరీ అశోక్, ఉపాధ్యాయులు కుమార్, వహీద్ గ్రామస్తులు పాల్గొన్నారు.