07-02-2026 12:13:13 AM
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మండల మాజీ జెడ్పిటిసి జగ్గీ జయరాజ్ కుమార్తె వెన్నెల వివాహ వేడుకలు ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో జరగడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్ గౌడ్,నల్లమడుగు సురేందర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చైర్ పర్సన్ దఫెదర్ రాజు,బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ,మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీనివాస్ నాయక్, సాయిబాబా, శ్రీనివాస్ గౌడ్, సాయిలు, మిద్దె బాబురావు, నరేష్, గోపాల్ గౌడ్, బాల్య నాయక్, వంశీకృష్ణ గౌడ్, బిట్ల మురళి,కాంత రెడ్డి, హనుమంత్ రెడ్డి, విజయ్ కుమార్, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.