calender_icon.png 8 November, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.100 కోట్ల భూకబ్జా విషయంలో ఎమ్మెల్యే తెరవెనుక రాజకీయం

08-11-2025 12:11:19 AM

  1. మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి 

జగిత్యాల అర్బన్, నవంబర్ 7 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో 100 కోట్ల విలువైన భూకబ్జా విషయంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన మిత్రుడి కోసం తెర వెనుక రాజకీయం చేస్తున్నాడని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావ ణి ఆరోపించారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్నప్పుడే పెట్రో ల్ పంపు భూకబ్జా విషయంలో మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. ఒక దశలో చైర్పర్సన్ గా తన రాజీనామాకు ఈ పెట్రోల్ పంపు వ్యవహారం కూడా ఒక కారణమని అ న్నారు.

గతంలోనే రెండు మూడు సందర్భాల్లో తన రాజీనామా కు ముందు ఆ త ర్వాత కూడా తాను మున్సిపల్ భూమి కబ్జా తో పాటు పెట్రోల్ పంప్ వ్యవహారం పై మీ డియా సమావేశంలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్ర యత్నం గా మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడుతున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్ అం డ్ బి ఆఫీస్ సైడ్ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వ స్తుందని తన పై ఒత్తిడి తీసుకువచ్చారన్నా రు. ఒక దశలో మొదలు పెట్టిన డివైడర్ ని ర్మాణాన్ని సైతం అలైన్మెంట్ మార్చి కట్టేలా చేసారన్నారు. కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు అప్పుడున్న ఎమ్మెల్యే సంజ య్ కుమార్ నన్ను నడిరోడ్డు పైన నిలబెట్టి ఇది మా వ్యక్తిగత విషయం నువ్వు తలదూర్చకని ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.

పెట్రోల్ పంపుకు అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆరోజు నా మీద ఒత్తిడి తీసుకురావ డానికి కారణం ఏంటని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు.నిజాలు తెలిసి కూ డా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారన్నారు.1948 సెప్టెంబర్ 17 న నిజాం పాలన ముగిసి 1949 ఇం డియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 195 2లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం కొన్నట్టు ఏ విధంగా తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై పొలిటికల్ ప్రెజర్ ఉందని సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రా న్ని అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.తాను చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎ లాంటి రికార్డులు మున్సిపల్ లో లభించలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయ మని అయితే మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

అవసరమై తే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరా రు. ప్రజల ఆస్తి ప్రజలకు చెందేలా చేయాలని ఇందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారం కూడా ఉంటుందని తెలిపారు. ఇక ఇటీవల అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మంజూ రు చేస్తే స్థానిక ఎమ్మెల్యే తానే తీసుకువచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

అభి వృద్ధి చేస్తే హర్షిస్తాం కానీ మందికి పుట్టిన పిల్లల్ని తమ పిల్లలని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. జగిత్యాలను ఎడ్యు కేషనల్ హబ్ గా మార్చేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారని అందులో భాగంగా నే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, బొడ్డు పెద్ద గంగారం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, జిల్లా కార్యదర్శులు పాత రమేష్, సాంబారి కళావతి, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, మర్రిపల్లి సాగర్, ఇట్యాల రాము, కాశె ట్టి తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు.