2 April, 2026 | 11:49 PM

పలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

06-10-2025 12:00 AM

అలంపూర్, అక్టోబర్ 05:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు.ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తిమ్మాపురం నారాయణ నూతన గృహప్రవేశ కార్యక్రమంతో పాటు నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే పాల్గొన్నారు.

జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అగస్త్య రెడ్డి ,గద్వాల బిఆర్‌ఎస్ ఇంచార్జి బాసు హనుమంత నాయుడు, ఈర్లదిన్నె రంగారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషోర్, వావిలాల రంగారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.