calender_icon.png 28 May, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ: ఎమ్మెల్సీ కవిత

27-05-2025 02:46:35 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సింగరేణి ప్రాంత జాగృతి నేతలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి నేతలతో సమావేశమై జాగృతి తరపున చేపట్టే కార్యక్రమాలు, తాజా పరిణామాలపై చర్చించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని, అందుకోసం సింగరేణి 11 ఏరియాలకు సమన్వయ కర్తలను నియమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని, బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.