11-06-2025 08:51:30 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha) బుధవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. లేఖ వివాదం తర్వాత కవిత తొలిసారి ఫామ్ హౌస్ కి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు వివారణకు హాజరుకానున్నారు. బీఆర్కే భవన్ లో కేసీఆర్ ను పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించనున్నారు. విచారణ కమిషన్ ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎం కేసీఆర్ కావడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ(Kaleshwaram project inquiry) కోసం కేసీఆర్ 11 బుధవారం ఉదయం 11:30 గంటలకు ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కమిషన్ గతంలో ఆయనకు, తెలంగాణ మాజీ నీటిపారుదల మంత్రులు హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ లకు నోటీసులు జారీ చేసింది.